కేంద్రం తీసుకొచ్చిన సాగుచట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమం చేసి అమరులైన రైతు కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం తరఫున రూ.3లక్షల ఆర్థికసాయం చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. రైతులకు సాయం కోసం రూ.22 కోట్లు కేటాయిస్తామని చెప్పారు. ‘‘సాగు చట్టాల రద్దుపై విజయం సాధించిన రైతులకు అభినందనలు. ఉత్తరాది రైతులు అద్భుత విజయం సాధించారు. రైతులపై పెట్టిన కేసులను కేంద్రం ఎత్తివేయాలి. ఉద్యమంలో అమరులైన రైతు కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం రూ.25 లక్షల చొప్పున ఇవ్వాలి. పంటలకు కనీస మద్దతు ధర చట్టం తీసుకురావాలి’’ అని కేసీఆర్ డిమాండ్ చేశారు.