34.7 C
Hyderabad
May 4, 2024 23: 30 PM
Slider కరీంనగర్

అరచేతిలో వైకుంఠాన్ని చూపిస్తున్న కేసీఆర్‌

#sharmila

బంగారు తెలంగాణ చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ అర చేతిలో వైకుంఠాన్ని చూపిస్తున్నారని వైఎస్‌ఆర్ టిపి అధ్యక్షులు వైఎస్‌ షర్మిల ఆరోపించారు. మహాప్రస్థావన పాదయాత్ర మానకొండూర్‌ మండల కేంద్రానికి చేరుకుంది. పాదయాత్రలో ఆమె ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. పెద్ద చెరువు వద్ద రోడ్డు షోలో మాట్లాడుతూ బంగారు తెలంగాణ అని చెప్పి ముఖ్యమంత్రి ప్రజలకు టోపీ పెట్టారని ఆరోపించారు.రైతుల రుణమాఫీ చేస్తానని చెప్పిన కేసీఆర్‌ నాలుగేళ్లు గడిచినా ఇప్పటి వరకు చేయలేదని విమర్శించారు.మహిళా సంఘాలకు పావలా వడ్డీ వర్తింప జేస్తామని చెప్పిన కేసీఆర్‌ మాట తప్పారన్నారు. స్థానిక ఎమ్మెల్యే బాలకిషన్‌ నియోజకవర్గంలో కన్పించడం లేదని,తమ సమస్యలను ఎవరికి తెలపాలో ప్రజలకు తెలియడం లేదన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షులు అక్కనపల్లి కుమార్‌, అధికార ప్రతినిథి కె.నగేష్‌, దుబ్బ నీరజ, రాజేశ్వర్‌, పిట్ట రాంరెడ్డి పాల్గొన్నారు.

Related posts

వైసీపీ నుంచి జనసేనకు కాపు నేతల వలసలు

Bhavani

విజయానికి సృజన ఒక్కటే చాలదు కృషి అవసరం

Satyam NEWS

అత్తింట్లో వేధింపులు భరించలేక యువతి ఆత్మహత్య

Satyam NEWS

Leave a Comment