35.2 C
Hyderabad
May 1, 2024 01: 27 AM
Slider రంగారెడ్డి

అత్తింట్లో వేధింపులు భరించలేక యువతి ఆత్మహత్య

#hemalatha

కొత్తగా పెళ్లైన ఒక యువతి అత్తింట్లో ఆరళ్లు భరించలేక ఆత్మహత్య చేసుకున్న సంఘటన మియాపూర్ లో జరిగింది. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని MA నగర్ లో నివాసం ఉంటున్న  పుట్ట హేమలత అనే 20 ఏళ్ల యువతికి ఇటీవలె వివాహం అయింది. వివాహం అయిన నాటి నుంచి అత్తింట్లో ఆమె వేధింపులు ఎదుర్కొంది. ఈ వరకట్న వేధింపులు భరించలేని హేమలత తన ఇంట్లో సీలింగ్ ఫ్యాన్ కు చున్నీ సహాయంతో ఉరి వేసుకొని చనిపోయింది. ఈ మేరకు మృతురాలి తల్లి జయసుధ మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related posts

పండగలా మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు

Satyam NEWS

స్విమ్మింగ్: 4 బంగారు పతకాలు సాధించిన షేక్ ఖాజా

Satyam NEWS

రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ‘దళిత బంధు’పథకం అమలుచేయాలి

Satyam NEWS

Leave a Comment