కొత్తగా పెళ్లైన ఒక యువతి అత్తింట్లో ఆరళ్లు భరించలేక ఆత్మహత్య చేసుకున్న సంఘటన మియాపూర్ లో జరిగింది. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని MA నగర్ లో నివాసం ఉంటున్న పుట్ట హేమలత అనే 20 ఏళ్ల యువతికి ఇటీవలె వివాహం అయింది. వివాహం అయిన నాటి నుంచి అత్తింట్లో ఆమె వేధింపులు ఎదుర్కొంది. ఈ వరకట్న వేధింపులు భరించలేని హేమలత తన ఇంట్లో సీలింగ్ ఫ్యాన్ కు చున్నీ సహాయంతో ఉరి వేసుకొని చనిపోయింది. ఈ మేరకు మృతురాలి తల్లి జయసుధ మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
previous post