34.7 C
Hyderabad
May 5, 2024 01: 07 AM
Slider ప్రత్యేకం

మంత్రి కేటీఆర్ కు హార్వర్డ్ యూనివర్సిటీ ఆహ్వానం

media creation

తెలంగాణ పరిశ్రమలు, ఐటీశాఖ మరియు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కు మరోసారి ప్రముఖ అంతర్జాతీయ ఆహ్వానం అందింది. ఈసారి హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి కేటీఆర్ కు ప్రత్యేక ఆహ్వానం అందింది. ఈసారి జరగనున్న హార్వర్డ్ యూనివర్సిటీ ఇండియా కాన్ఫరెన్స్ -2020కి హాజరుకావాల్సిందిగా మంత్రి కేటీఆర్ ని కోరింది.

అమెరికాలోని బోస్టన్ లో ఉన్న హార్వర్డ్ బిజినెస్ స్కూల్ లో ఫిబ్రవరి 15 ,16 తేదీల్లో ఇండియా కాన్ఫరెన్స్ నిర్వహించనున్నది. “20/20 foresight” ఆనే థీమ్ తో యూనివర్సిటీ నిర్వహిస్తున్న 17వ ఇండియా కాన్ఫరెన్స్ కోసం పలువురు కీలక వ్యక్తులను ఆహ్వానించింది. ఈ సమావేశంలో “భారతదేశంలో స్మార్ట్ సిటీలు” అనే అంశం పైన మాట్లాడాల్సిందిగా మంత్రి కేటీఆర్ ను ఇండియా కాన్ఫరెన్స్ నిర్వాహకులు కోరారు.

ఒకవైపు ఐటీశాఖ తో పాటు మరోవైపు పురపాలక శాఖ బాధ్యతలు కూడా నిర్వహిస్తున్న మంత్రి కేటీఆర్, టెక్నాలజీ, ఇన్నోవేషన్ వంటి అంశాలతో పట్టణాల అభివృద్ధి వంటి అంశాల సమ్మిళితం అయిన  స్మార్ట్ సిటీ అంశంపైన ప్రసంగించడం ముదావహంగా ఉంటుందని పేర్కొంది. భారతదేశ అంశాలపైన అమెరికాలో నిర్వహించే అతిపెద్ద సదస్సు ఈ హార్వర్డ్ ఇండియా కాన్ఫరెన్స్. హార్వర్డ్ యూనివర్సిటీ మరియు హార్వర్డ్ కెన్నెడీ స్కూల్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ సమావేశానికి భారత్-అమెరికాల నుంచి పలు రంగాల్లోని ప్రముఖులు హాజరు అవుతారు.

ఇరు దేశాల నుంచి సుమారు వెయ్యి మంది ప్రతినిధులు ఈ కాన్ఫరె న్స్ కు హాజరవుతారు.  ముఖ్యంగా అమెరికాలోని యంగ్ ప్రొఫెషనల్స్, ఇండస్ట్రీ లీడర్లు, అమెరికాలో వివిధ కంపెనీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న భారతీయ అమెరికన్లు, విద్యార్థులు, వివిధ యూనివర్సిటీల ప్రొఫెసర్లు ఈ కాన్ఫరెన్స్ కి హాజరై కీలకమైన అంశాలపై ఆయన విస్తృతంగా చర్చిస్తారు. మంత్రి కేటీఆర్ తో పాటు ప్రముఖ ఆర్థికవేత్త అరవింద్ సుబ్రహ్మణ్యన్, అరుణ్ పూరి, సురేష్ ప్రభు, జయంత్ సిన్హా , అనుపమ్ ఖేర్, రితేష్ అగర్వాల్ వంటి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను కూడా ఈ కాన్ఫరెన్స్ కి ఆహ్వానించింది.

Related posts

మాణిక్ రావ్ ఠాక్రేతో జానారెడ్డి, పొంగులేటి భేటి

Bhavani

కరోనా కట్టడి చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం – ఆది శ్రీనివాస్

Satyam NEWS

వి ఎస్ యూనివర్సిటీ లో జాతీయ ఐక్యత దినోత్సవం

Satyam NEWS

Leave a Comment