కడప జిల్లా ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో ఇదివరకు ఎస్ఓ గా విధులు నిర్వహించిన సమయంలో అర్జున్ నాయక్ పై కేసు నమోదు అయింది. లైంగిక వేధింపుల ఆరోపణలతో ఆయనను ట్రిపుల్ ఐటీ నుంచి సస్పెండ్ చేశారు.
ట్రిపుల్ ఐటీ మహిళా సెక్యూరిటీ గార్డులు ఇడుపులపాయ ఆర్కేవ్యాలీ పోలీసు స్టేషన్ లో ఈ మేరకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు పై ఇడుపులపాయ ఆర్కేవ్యాలీ యస్ఐ కృష్ణమూర్తి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.