41.2 C
Hyderabad
May 4, 2024 17: 00 PM
Slider నిజామాబాద్

ఎంపీపీని సస్పెండ్ చేయాలి: రెడ్డి ఐక్య వేదిక డిమాండ్

#macharam

మాచారెడ్డి ఎంపీపీ లోయపల్లి నర్సింగ్ రావువు వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని రెడ్డి ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సంతోష్ రెడ్డి డిమాండ్ చేశారు. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని దేవునిపల్లి లక్ష్మీదేవి గార్డెన్లో రెడ్డి ఐక్య వేదిక ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా సంతోష్ రెడ్డి మాట్లాడుతూ.. ఒక బాధ్యత కలిగిన వ్యక్తి మరొక బాధ్యత కలిగిన వ్యక్తిపై దాడి చేయడం సరికాదన్నారు. అంతర్గత కుమ్ములాటలు కమ్యూనిటీపై ప్రభావం చూపవద్దన్నారు. వ్యక్తిగత విబేధాలు ఉంటే అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి కూర్చుని మాట్లాడుకుంటే పరిష్కారం అవుతాయి తప్ప దాడులు చేసుకుంటే కావన్నారు.

కామారెడ్డిలో కొంతకాలంగా రాజకీయ కుట్ర జరుగుతోందని, దానిలో భాగంగానే ఈ దాడిగా తాము భావిస్తున్నామని తెలిపారు. ఎంపీపీ తనకు పలుకుబడి ఉందని రెచ్చిపోతే రెడ్డిల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఇటువంటి ఘటనలు పునరావృతం అయితే భవిష్యత్తులో ఎంపీపీ బయట తిరగలేరన్నారు. ఈ విషయంపై ఎమ్మెల్యే, ఇంఛార్జీలు చొరవ తీసుకుని ఎంపీపీని సస్పెండ్ చేయించాలన్నారు. పార్టీ పరంగా తాము మాట్లాడటం లేదని, కేవలం తమ ఐక్య వేదిక ద్వారానే మాట్లాడుతున్నామని స్పష్టం చేశారు. గతంలో ఇద్దరు రెడ్డిలు కొట్లాడితే ఒక రెడ్డిని సస్పెండ్ చేసినట్టు ఇప్పుడు కుడి ఎంపీపీని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. రేపు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన రెడ్డి ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని తాము బహిష్కరిస్తున్నామని, ఎంపీపీపై చర్యలు తీసుకున్న తర్వాతే సమ్మేళనం చేపట్టాలని కోరారు.

సత్యం న్యూస్, కామారెడ్డి

Related posts

దిశ యాప్ వినియోగించుకోండి: మంత్రి ధ‌ర్మాన పిలుపు

Satyam NEWS

దళితుడిపై దాడి చేసినా అరెస్టు చేయని పోలీసులు

Bhavani

మద్యం సేవించి వాహనాలు వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవు

Satyam NEWS

Leave a Comment