40.2 C
Hyderabad
May 2, 2024 16: 05 PM
Slider ప్రపంచం

ఇదోరకం పిచ్చి :ట్విట్టర్ ఫాలోవర్స్‌కు కోట్లుకుమ్మరించిన బిలియనీర్

he is mad

సోషల్ మీడియా…! ఈ మేనియా లేని వారుండరు. స్మార్ట్‌ ఫోన్ చేతిలో ఉందంటే చాలు.. సోషల్ మీడియాలో విహాంగ విక్షణం చేస్తుంటారు. కొందరైతే క్షణం కూడా తల తప్పికుండా సోషల్ మీడియాలో లీనమై పోతుంటారు. మరికొందరైతే… సోషల్ మీడియాను చూడకుండా ఉంలేమేమోనన్న ఫోబియాలోకి ఇప్పటికే వెళ్లిపోయారు. ఇదంతా ఒక తీరు అయితే.. జపాన్‌కు చెందిన ఓ బిలియనీర్ తీసుకున్న నిర్ణయం మాత్రం సర్వత్రా ఆశ్చర్యం కలిగిస్తోంది. సోషల్ మీడియాలో తనను ఫాలో అవుతూ

తన ఫోస్టును రీట్వీట్ వారికి ఏకంగా కోట్లు కుమ్మరించాడు. సోషల్ మీడియాలో ఫాలో అయితే కోట్లు పంచిపెట్టిన ఆ వ్యక్తి ఎవరు అనేక కదా మీ డౌట్…? ఆ వ్యక్తి మరెవరో కాదు… జపాన్‌ లో రెండవ అతిపెద్ద షాపింగ్‌ సంస్థ జోజో ఇంక్‌ వ్యవస్థాపకుడైన యుసాకు మేజావా.

అయితే, ట్విట్టర్‌లో తన ఫాలోవర్స్‌కి ఏకంగా రూ. 64.36 కోట్లు పంచిపెట్టడం సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేస్తోంది. ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో తెలిస్తే షాక్ అవుతారు. సోషల్‌ మీడియాలో వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టిన ఆయన… తన ట్విటర్‌ ఫాలోవర్స్‌లో వెయ్యి మందికి ఈ నగదును పంచిపెట్టనున్నారు.

6.8 మిలియన్ల మంది ఫాలోవర్స్‌ ఉన్న యుసాకు మేజావా జనవరి 1వ తేదీన ట్విటర్‌లో తన పోస్ట్‌ను రీట్వీట్ చేసిన వెయ్యిమంది ఫాలోవర్స్‌ను ఎంపిక చేసి వారికి $ 9 మిలియన్‌ డాలర్లు (సుమారు రూ. 64.36 కోట్లు) అందజేయనున్నామని ప్రకటించారు. ఈ ట్వీట్ రికార్డు స్థాయిలో 3.8 మిలియన్ల షేర్లను సాధించి… జనవరి 7 నాటికి అత్యధిక రిట్వీట్స్‌ పొందిన ట్వీట్‌గా నిలిచింది.

Related posts

సందీప్ రెడ్డి  మరణం తీరని లోటు

Satyam NEWS

రానా విరాట ప‌ర్వం ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

Sub Editor

రైతుపై ప్ర‌భుత్వాల‌కు శ్ర‌ద్ధ ఉందా?

Sub Editor

Leave a Comment