సందీప్ రెడ్డి మరణం మనకు తీరని లోటని బి ఎల్ ఆర్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు, బి ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు బండారి లక్ష్మారెడ్డి అన్నారు. ఆదివారం నాచారం డివిజన్ కి చెందిన దివంగత యువ నాయకుడు సందీప్ రెడ్డి జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బండారి లక్ష్మారెడ్డి పాల్గొని అన్నదానం చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మంచి మనసున్న మనిషి, యువతకు ఆదర్శం ఐన యువ నాయకుడు సందీప్ రెడ్డి మరణం మనకు తీరని లోటని పేర్కొన్నారు. అలాంటి యువ నాయకుడు మన మధ్య లేకపోవడం బాధాకరం అని అన్నారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు సాయి జేన్ శేఖర్,సందీప్ రెడ్డి అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
సత్యం న్యూస్, మేడ్చల్ జిల్లా