26.7 C
Hyderabad
May 16, 2024 07: 51 AM
Slider హైదరాబాద్

మ‌ల‌క్‌పేట్ రేస్ కోర్సులో జాకీ మృతి!

Race

హైద‌రాబాద్ రేస్‌క్ల‌బ్‌లో దారుణం చోటు చేసుకుంది. రేస్ కొన‌సాగుతున్న స‌మ‌యంలో గుర్రంపై స్వారీ చేస్తున్న జాకీ జితేంద‌ర్ సింగ్ కింద‌ప‌డి మ‌ర‌ణించాడు. ఆదివారం మ‌ధ్యాహ్నం ఉస్మాన్‌సాగ‌ర్ రేసు సంద‌ర్భంగా జాకీ జితేంద‌ర్‌సింగ్ పాల్గొన్నాడు. ఈయ‌న స్వారీ చేసే గుర్రం వేగం పుంజుకోవ‌డంతో ఉన్న‌ట్టుండి హ‌ఠాత్తుగా గుర్రంపై నుంచి కింద‌ప‌డ్డాడు. రేసు కోర్సు నిర్వాహ‌కులు వెంట‌నే అత‌న్ని ఆసుప‌త్రికి తీసుకెళ్ల‌డంతో అప్ప‌టికే చ‌నిపోయాడ‌ని వైద్యులు తెలిపారు. మ్ర‌త‌దేహాన్నిపోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుప‌త్రికి తీసుకువెళ్లారు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు. కాగా రేసుకోర్సులో ఈ మాదిరి మ‌ర‌ణాలు ఇంత‌కుముందు కూడా సంభ‌వించాయి. జితేంద‌ర్‌సింగ్ జాకీగా రెండు రోజుల క్రిత‌మే రాజ‌స్థాన్ నుంచి న‌గ‌రానికి వ‌చ్చి రేసుకోర్సులో బ‌స చేశారు.

Related posts

తెలుగుదేశం పార్టీ పునర్ నిర్మాణం దిశగా అడుగులు

Satyam NEWS

Vijayanagaram police: నో యాక్సిడెంట్ డే గా సిబ్బందితో ప్ర‌త్యేక చ‌ర్య‌లు

Satyam NEWS

వి ఎస్ యూ లో ఘనంగా బాలికల దినోత్సవం

Bhavani

Leave a Comment