ఆదివారం సికింద్రాబాద్ నుంచి ఢిల్లీ వెళుతున్నరాజధాని ఎక్స్ప్రెస్ రైలు ఇంజిన్లో ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన రైల్వేశాఖ సిబ్బంది వెంటనే రైలును నవాంద్గీ వద్ద నిలిపివేసి మంటలను అదుపులోకి తెచ్చారు. షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు చెలరేగినట్లు సమాచారం. ఏది ఏమైనా సకాలంలో మంటలను అదుపు చేయడంతో ప్రాణనష్టం సంభవించలేదు. అనంతరం రైలింజన్ను వేరు చేశారు. సహాయక చర్యల్లో తాండూరుకు చెందిన అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు. ప్రమాదం అనంతరం మరో రైలింజన్ ద్వారా ప్రయాణికులను పంపించే ఏర్పాట్లు చేసినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.
previous post
next post