ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం వివి పాలెం గ్రామానికి చెందిన పలువురు బిఆర్ఎస్ పార్టీ లో చేరారు. ఖమ్మం లోని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర రవాణా శాఖ మాత్యులు పువ్వాడ అజయ్ కుమార్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నుండి బి ఆర్ ఎస్ పార్టీలోకి చేరారు. గ్రామ మాజీ సర్పంచ్ తేజవాత్ కళావతి తో పాటు తేజవత్ సౌమిత్, లాల్ కుమార్, చిర్రా రామ కృష్ణ, ఆదినారాయణ, తగరం కిరణ్, సాయి, బానోత్ ఉపేందర్, హరీష్, భీమా తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు తోలుపునూరి దానయ్య మార్కెట్ డైరెక్టర్ కుతుoబాక నరేష్, గ్రామ పార్టీ కార్యదర్శి వర్దబోయిన కోదండరాములు, మండల ఆర్గనైజింగ్ సెక్రెటరీ మాలోత్ రమేష్, మండల ఎస్టీ సెల్ ఉపాధ్యక్షులు గుగులోతు ప్రవీణ్, సీనియర్ నాయకులు కూరాకుల సత్యం, పరిటాల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
previous post
next post