తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలను పల్నాడు జిల్లా నరసరావుపేట పార్లమెంటు సభ్యుడు లావు శ్రీ కృష్ణ దేవరాయలు తీవ్రంగా ఖండించారు. తాను చంద్రబాబును కలిసానని, పార్టీ మారుతారని చెప్పటం అనేవి పూర్తిగా అవాస్తవాలు.. నేను వైస్సార్సీపీ, జగనన్న తోనే ఉన్నాను..అని అన్నారు. మీడియా వాళ్ళు అసత్య ప్రచారాలు చేయటం వల్ల.. ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, మీడియా వాళ్ళకి అందరికీ కూడా టైమ్ వేస్ట్..అని ఆయన అన్నారు.
రాష్ట్రానికి రావాల్సిన అంశాలపైనో, అభివృద్ధి విషయాలపైన మమ్మల్ని ప్రశ్నించాలి..అంతేగానీ అసత్య ప్రచారాలతో సమయం వృధా చేయవద్దని ఆయన అన్నారు. ఆ ఫోటోల్లో లేరు.. వీడియోల్లో లేరు అంటూ మీడియా హడావుడి చేస్తే ఎం వస్తుంది.. ఫోటోలతోనో, వీడియోలతోనో సోషల్ మీడియాల్లో ప్రచారం చేసుకుంటే ఎం వస్తుంది.. ప్రచారం కోసం నేను.. ఎంపీ కాలేదు.. ప్రజలకు మేలు చేయటానికి ఎంపీ అయ్యాను. మీడియా ప్రచారాలు ప్రజలు నమ్మొద్దు.. అని నరసరావుపేట ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయలు అన్నారు.