ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో జరిగిన MPTC & ZPTC ఎన్నికలను రాష్ట్ర హైకోర్ట్ రద్దు చేసింది. మళ్ళీ తాజా ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వాలని హైకోర్ట్ తీర్పు చెప్పింది. పోలింగ్కు నాలుగు వారాల ముందు నోటిఫికేషన్ ఇవ్వాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను రాష్ట్ర ఎన్నికల సంఘం పాటించలేదని హైకోర్టు తేల్చి చెప్పింది. MPTC & ZPTC ఎన్నికలను అంత హడావుడిగా నిర్వహించలేమని అప్పటి ఎన్నికల కమిషనర్ డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చెప్పగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రులు, నాయకులు ఆయనపై తీవ్ర విమర్శలు చేశారు. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం ఎన్నికలు జరపలేదని హైకోర్టు ఇప్పుడు తీర్పు ఇవ్వగా దీనిపై సుప్రీంకోర్టు కే అప్పీల్ కు వెళ్లాలని ఏపీ సర్కారు యోచిస్తున్నది.
previous post