సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం పరిధిలోని మేళ్లచెరువు మండల కేంద్రంలోని కొలిచిన వారికి కొంగు బంగారమై కోరిన కోర్కెలు తీర్చే శ్రీ స్వయంభు శంభు లింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈరోజు మాస శివరాత్రి సందర్భంగా శ్రీ ఇష్ట కామేశ్వరీ సమేత స్వయంభు శంభు లింగేశ్వర స్వామి వారికి కళ్యాణాన్ని అర్చకులు అత్యంత వైభవంగా నిర్వహించారు.
నిత్య కళ్యాణంతో విరాజిల్లే స్వామివారికి కరోన లాక్ డౌన్ కాలంలో నిత్య పూజలు తప్ప భక్తులకు ప్రవేశం లేదు. కానీ నేడు లాక్ డౌన్ ఎత్తివేయడంతో దేవాలయాల శోభా పెరిగింది. నిత్యం భక్తులతో కిటకిటలాడే దేవాలయాలు నేడు కొద్దిమంది భక్తులతో స్వామి వారు పూజలు అందుకుంటున్నారు. ఈ క్రమంలో భాగంగా వేద మూర్తులైన పండితుల సమక్షంలో వేదోక్త ప్రకారంగా శ్రీ స్వామివారి కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు కొంకపాక విష్ణువర్ధన్ శర్మ, ధనుంజయ శర్మ, వేదపండితులు శివ శర్మ, ఆలయ కార్యనిర్వహణాధికారి, సిబ్బంది, పరిమిత సంఖ్యలో భక్తులు భౌతిక దూరాన్ని పాటిస్తూ పాల్గొని స్వామివారి కల్యాణాన్ని తిలకించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.