జాతీయ గణిత దినోత్సవాన్ని కొల్లాపూర్ గాంధీ స్మారకోన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. భారత గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా నిర్వహించే ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ జిల్లా గణిత ఫోరం ప్రధాన కార్యదర్శి D.శ్రీకాంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “గణితంముద్దు- భయం వద్దు“ అని విద్యార్థులు గణితం పట్ల అవగాహన పెంపొందించుకోవడం వల్ల భయం పోతుందని తెలిపారు. అందరూ అచ్చంపేటలో జరిగే జిల్లా స్థాయి గణిత సామర్థ్య పరీక్షను విజయవంతం చేయాలని కోరారు.