కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు అండగా ఉండాలని, వారి కష్ట సుఖాలు తెలుసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునివ్వడంతో అంబర్ పేట్ నియోజకవర్గం ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ కార్యరంగంలోకి దిగారు. బాగ్ అంబర్ పేట్ లో ఆయన నేడు విస్తృతంగా పర్యటించారు.
గల్లీ గల్లీలో తిరుగుతూ ప్రజలకు కరోనా వైరస్ పై అవగాహన కలిగించారు. సంబంధిత జిహెచ్ఎంసి, పోలీస్ సిబ్బంది తో కలిసి ఆయన కొద్ది సేపు పని చేశారు. ఈ సందర్భంగా ఆయన నిత్యావసర వస్తువుల గురించి వాకబు చేశారు.
నిత్యావసర సరుకులను అధిక రేట్లు తో అమ్మితే కఠినమైన చర్యలు తీసుకుంటానని ఆయన హెచ్చరించారు. ప్రతి నిమిషం మీ సమస్యల కోసం అంబర్ పేట్ లోనే ఉంటానని ఆయన ప్రజలకు వివరించి చెప్పారు.