ఎన్నికలు సమీపిస్తున్న వేళ… జగన్ ప్రభుత్వం పలు ప్రారంభోత్సవాలకు శ్రీకారం చుడుతోంది. ఈ క్రమంలో రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విజయనగరంలో పర్యటించనున్నారు. వాస్తవానికి ముందు రోజే అంటే 19వ తేదీన వచ్చి ఆ రోజు సాయంత్రం తిరిగి వెళ్లిపోవాలి. కానీ విజయనగరంలో అదీ స్థానిక ఎమ్మెల్యే వీరభద్ర స్వామి ఆధ్వర్యంలో నగరంలోని పెద్ద చెరువు గట్టు వద్ద… ఎస్. బీ. ఐ వద్ద కొత్తగా నిర్మించిన గాంధీ విగ్రహాన్ని మంత్రి బొత్స చేతుల మీదుగా ప్రారంభించదలచుకున్నారు. దీంతో ముందు రోజు వచ్చిన మంత్రి బొత్స 20వ తేదీన అంటే మంగళవారం మధ్యహ్నం 3 గంటలకు 14వ వార్డులో పాఠశాల భవనాలను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 4.00 గంటలకు ఏ.పి. టిడ్కో ఇళ్లను ప్రారంభిస్తారు. సాయంత్రం 5 గంటలకు ఎస్.బి.ఐ కూడలి వద్ద మహాత్మ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు.
previous post