34.7 C
Hyderabad
May 5, 2024 01: 21 AM
Slider ముఖ్యంశాలు

20న విజయనగరంలో మంత్రి బొత్స సత్యనారాయణ పర్యటన

#botsa

ఎన్నికలు సమీపిస్తున్న వేళ… జగన్ ప్రభుత్వం పలు ప్రారంభోత్సవాలకు శ్రీకారం చుడుతోంది. ఈ క్రమంలో రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విజయనగరంలో పర్యటించనున్నారు. వాస్తవానికి ముందు రోజే అంటే 19వ తేదీన వచ్చి ఆ రోజు సాయంత్రం తిరిగి వెళ్లిపోవాలి. కానీ విజయనగరంలో అదీ స్థానిక ఎమ్మెల్యే వీరభద్ర స్వామి ఆధ్వర్యంలో నగరంలోని పెద్ద చెరువు గట్టు వద్ద… ఎస్. బీ. ఐ వద్ద కొత్తగా నిర్మించిన గాంధీ విగ్రహాన్ని మంత్రి బొత్స చేతుల మీదుగా ప్రారంభించదలచుకున్నారు. దీంతో ముందు రోజు వచ్చిన మంత్రి బొత్స 20వ తేదీన అంటే మంగళవారం మధ్యహ్నం 3 గంటలకు 14వ వార్డులో పాఠశాల భవనాలను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 4.00 గంటలకు ఏ.పి. టిడ్కో ఇళ్లను ప్రారంభిస్తారు. సాయంత్రం 5 గంటలకు ఎస్.బి.ఐ కూడలి వద్ద మహాత్మ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు.

Related posts

సీ ప్రెస్ పిష్ మార్కెట్ ను ప్రారంభించిన బన్నల ప్రవీణ్ ముదిరాజ్

Satyam NEWS

దక్షిణ భారత దేశానికి మండస్ తుపాను ప్రమాదం

Satyam NEWS

సూర్యప్రభవాహనంపై శ్రీ మన్నారాయణుడి అభయం

Satyam NEWS

Leave a Comment