స్త్రీ, శిశు సంక్షేమ కమిటీ చైర్ పర్సన్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన రేఖ శ్యాంనాయక్ కు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అభినందనలు తెలిపారు. అసెంబ్లీ స్త్రీ, శిశు సంక్షేమ కమిటీ చైర్ పర్సన్ గా ఎమ్మెల్యే అజ్మీరా రేఖా శ్యాంనాయక్ పదవీ భాద్యతలు చేపట్టారు.
శుక్రవారం అసెంబ్లీలోని తన ఛాంబర్లో ప్రత్యేక పూజలు చేసి ఆమె బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగా రేఖా శ్యాంనాయక్ కు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపి అభినందించారు. ఈ కార్యక్రమంలొ ఎమ్మెల్యేలు విఠల్ రెడ్డి, భూపాల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.