దిశా హత్య నిందితుల ఎన్ కౌంటర్ విషయం హైకోర్టు కు చేరింది. సాయంత్రం 6గంటలకు అందిన వినతిపత్రంపై స్పందించిన హైకోర్టు నేడు విచారణ చేపట్టింది. హైకోర్టులో విచారణకు ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ హాజరయ్యారు. శవపరీక్ష ప్రక్రియను వీడియో చిత్రీకరణ చేసినట్లు కోర్టుకు తెలిపారు.
వాదనలు విన్న న్యాయస్థానం పిటిషన్పై ఈనెల 9న విచారణ చేపడతామని వెల్లడించింది. అప్పటి వరకూ ఆరిఫ్, నవీన్, శివ, చెన్నకేశవుల మృతదేహాలను భద్రపరచాలని కోర్టు ఆదేశించింది.