ఖమ్మం జిల్లా వైరా లో హెచ్.పి గ్యాస్ లో పనిచేస్తున్న శ్రీకన్య (30) నునావత్ రాణి (28) ఆఫీస్ కి తమ స్కూటీ మీద వెళుతుండగా శ్రీశ్రీ సర్కిల్ దగ్గరకు రాగానే ఎదురుగా వస్తున్న లారీ అతి వేగంగా వచ్చి ఢీకొట్టడంతో శ్రీ కన్య అక్కడికక్కడే మృతి చెందింది. వీరిని ఢీ కొట్టిన లారీ అదే వేగంతో వెళ్లి టేకులపల్లి బ్రిడ్జి దగ్గర ఒక కారును ఢీ కొట్టింది.
తీవ్రంగా గాయపడిన రాణిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు. మృతి చెందిన శ్రీ కన్యది మరిపెడ బంగ్లా కాగా తీవ్ర గాయాలైన రాణి ది గుర్రాలపాడు తండా. మృతి చెందిన శ్రీ కన్యను ప్రభుత్వాసుపత్రి మార్చురీ కి తరలించారు.