Slider ముఖ్యంశాలు

జగన్ జైలుకెళితే మొదట సంతోష పడే వ్యక్తి పెద్దిరెడ్డి

#bhatyala

ఎన్టీ రామారావుకు నాదెండ్ల భాస్కరరావు ఎలా వెన్నుపోటు పొడిచాడో అదేవిధంగా జగన్ కు వెన్నుపోటు పొడిచేందుకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సిద్ధంగా ఉన్నాడని టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ రాజంపేట అసెంబ్లీ ఇన్చార్జి బత్యాల చెంగల్ రాయుడు అన్నారు. అన్నమయ్య జిల్లా రాజంపేట బత్యాల భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పెద్దిరెడ్డి గురించి తనకు విద్యార్థి దశ నుంచే బాగా తెలుసునని చెప్పారు. 1978 లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక మైనార్టీ నాయకుడి చేతిలో చిత్తుగా ఓడిపోయారని గుర్తు చేశారు.

చంద్రబాబు నాయుడు విషయానికి వస్తే ఆయన విద్యార్థి దశ నుంచే నాయకుడుగా విజయాలు సాధిస్తూ వచ్చారని తెలిపారు. అటువంటి మా నాయకుడు పై ఆరోపణలు చేస్తూ ప్రగల్భాలు పలకడం ఆయనకు ఎంత మాత్రం తగదని ఎద్దేవా చేశారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో నీవు విజయం సాధించి మీ కుటుంబంలోని వారికే సీట్లు కేటాయించుకొని ఇసుక, మైనింగ్ మాఫియాలను నిర్వహిస్తూ ప్రజాధనాన్ని కొల్లగొడుతూ పోలీసులను అడ్డబెట్టుకొని టిడిపి నాయకులపై కేసులు బనాయిస్తూ సిగ్గు లేని పాలన చేస్తున్నావని విమర్శించారు.

దళితులను మైనార్టీలను విస్మరించి ఎదురు తిరిగిన వారిపై కేసులు బనాయిస్తూ అనేక రకాలుగా వారిని ఇబ్బందులకు గురి చేస్తూ రాజ కీయాలు కొనసాగిస్తున్నావని మీ పార్టీ సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం ఇచ్చిన ప్రకటనతోనే నీ బండారం అంతా తేటతెల్లమం దని ఆరోపించారు. తాను కూడా కోడూరులో కళ్యాణ మండపం నిర్మించాలని దానిని పేద ప్రజల కు కేవలం 5000 రూపాయలకే ఇస్తున్నానని చెప్పారు దమ్ముంటే నువ్వు కూడా నా మాదిరిగానే తక్కువ ధరలకు పేద ప్రజలు కళ్యాణ మండపాలు ఇవ్వాలని చెప్పారు. మా పార్టీ అధినేత వర్మిషన్ ఇచ్చి ఉంటే నీ మీద ఎప్పుడోకేసులు వేసి నువ్వు దోచుకున్న ఆ కోట్ల రూపాయలన్నింటినీ కక్కించి వసూలు చేసేవారిని చెప్పారు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు పై ఆరోపణలు చేయడం మానుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Related posts

చండ్ర రాజేశ్వరరావు ఫౌండేషన్ కు SBI గిఫ్ట్  

Satyam NEWS

వైద్య సేవలను ఆరోగ్య శ్రీ పోర్టల్ లో నమోదు చేయాలి

Murali Krishna

తెలంగాణలో మారిన బ్యాంకు పని వేళలు

Satyam NEWS

Leave a Comment