కేసీఆర్ అధికారంలో వున్నప్పుడు మైనార్టీలకు చేసిందేమి లేదని ప్రభుత్వ సలహాదారు, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు షబ్బీర్ అలీ, అధికార ప్రతినిధి నిజాముద్దీన్ అన్నారు. గాంధీ భవన్ లో నేడు జరిగిన ప్రెస్ మీట్ లో షబ్బీర్ అలీ మాట్లాడుతూ మాజీ మంత్రి కేటీఆర్ మైనార్టీలపై దొంగ ప్రేమ ఒలకపోస్తున్నాడని అన్నారు. వాళ్లు అధికారంలో వున్నప్పుడు మైనార్టీలకు ఏమి చేశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కామారెడ్డికి వచ్చి మీ అయ్యా ఎందుకు పోటీ చేసిండు? ఒక్క అమాయకుణ్ణి ఓడగొట్టడానికి ఎన్ని ప్రయత్నాలు చేసిండ్రు అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ మైనార్టీలకు అవకాశాలు ఇస్తుంది. నిలబడ్డ మైనార్టీ నేతలు ఓడిపోయారు.. ఏం చేద్దాం మరి అందుకే తనకు కాంగ్రెస్ సర్కార్ సలహాదారులుగా నియమించింది అని ఆయన అన్నారు.
previous post