27.7 C
Hyderabad
May 4, 2024 09: 54 AM
Slider చిత్తూరు

ఈద్గాకు ప్రారంభోత్సవం చేసిన మంత్రి ఆర్.కె.రోజా

#ministerroja

రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక వ్యవహారాల, యువజన సర్వీసులు మరియు క్రీడా శాఖ మంత్రి ఆర్.కె.రోజా వడమాలపేట మండలం పూడి గ్రామంలో సచివాలయం పక్కన నూతనంగా నిర్మించిన ముస్లిం సోదరుల ప్రార్ధనా స్థలం ఈద్గా కు ఆదివారం ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి ఆర్.కె.రోజాకు ముస్లిం మత పెద్దలు ఘనస్వాగతం పలికారు. ఈద్గా వద్ద నిర్వహించిన ప్రార్ధన లో మంత్రి పాల్గొన్నారు. ఈద్గా వద్దకు వచ్చిన ముస్లిం మహిళలతో మంత్రి ఆప్యాయంగా  పలకరించి మాట్లాడారు. మంత్రి ఈద్గా వద్దకు హాజరైన వారికి పంచదార పంపిణి చేసి సంతోషాన్ని పంచుకున్నారు. వడమాల పేట మండలంలోని ముస్లిం సోదరులు మంత్రి ఆర్.కె.రోజా ని సోదరులు రాంప్రసాద్ రెడ్డి ని గజమాలతో, శాలువ కప్పి సత్కరించారు.

ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అలాగే వైయస్సార్ ముస్లిం సోదర సోదరిమణులను తమ కుటుంబ సభ్యులుగా భావించి వారికి ఎల్లవేళలా అండగా వున్నారని తెలిపారు. ముఖ్య మంత్రి  జగన్మోహన్ రెడ్డి ముస్లిం సోదర సోదరిమణులకు విద్య, వైద్యం,ఆర్థిక భరోసా ఇస్తూ సమాజంలో గౌరవంతో పాటు రాజకీయం గా  కూడా  అభివృద్ధి చేస్తున్నారని  వివరించారు.జగనన్న తన తండ్రి అడుగుజాడల్లోనే నడుస్తూ ఎన్నో మంచి కార్యక్రమాలు చేయడం మనం గమనించాలని చెప్పారు. జగనన్న ఆశీస్సులతో ఈ బడ్జెట్లో రెండు కోట్ల రూపాయలు శాంక్షన్ అయిందని నెక్స్ట్ మంత్ పైన స్టార్ట్ చేస్తామని  తెలిపారు. ఈ కార్యక్రమం లో వడమాలపేట ఎంపీపీ, వైస్ ఎంపీపీలు, ఎంపీటీసీలు, డీసీసీబీ వైస్ చైర్మన్, సర్పంచులు, రాష్ట్ర డైరెక్టర్లు, కమిటీ చైర్మన్లు, ప్రజా ప్రతినిధులు, ముస్లిం మత పెద్దలు, వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Related posts

జనాన్ని ఆకట్టుకుంటున్న శ్యామ్ కళా యాత్ర

Satyam NEWS

(Free|Sample) Hoodia Diet Weight Loss Pill Successful Weight Loss Pills

Bhavani

నా రాజీనామాతో వచ్చే ఉప ఎన్నికలో పోటీ చేయను

Satyam NEWS

Leave a Comment