37.2 C
Hyderabad
May 6, 2024 22: 25 PM
Slider ముఖ్యంశాలు

బండి సంజయ్.. దమ్ముంటే మీ రాష్ట్రాల్లో పథకాలు అమలు చేయించు

#MinisterVemula

దమ్ము ధైర్యం ఉంటే తెలంగాణలో అమలవుతున్న పథకాలను బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలు చేయించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కి రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సవాల్ విసిరారు.

సీఎం కేసీఆర్ పై నోరు పారేసుకుంటే సహించేది లేదని హెచ్చరించారు. సోమవారం ఆయన కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల కార్యక్రమంలో  పాల్గొన్నారు.

పట్టణంలోని పెద్ద చెరువు కట్టపై రోడ్డు, ఇరువైపుల బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అలాగే 100 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

నూతనంగా నిర్మించిన ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ… దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని అన్నారు.

సోషల్ మీడియా వేదికగా అబద్ధపు ప్రచారాలు చేస్తున్న బీజేపీ నాయకులు వారు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఇలాంటి పథకాలు అమలు చేయాలని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కి సవాల్ విసిరారు. అవాకులు చెవాకులు పేలుతున్న మీ భరతం పట్టే రోజులు దగ్గరలో ఉన్నాయని హెచ్చరించారు.

పరిష్కార వేదికలా క్యాంపు కార్యాలయాలు

ప్రజా సమస్యల పరిష్కార వేదికగా క్యాంపు కార్యాలయాలు పనిచేయాలని మంత్రి అన్నారు. ప్రతి ఒక్క అధికారికి ప్రజాప్రతినిదికి కార్యాలయం ఉండేదని, ఎమ్మెల్యేలకు మాత్రం కార్యాలయం లేదన్నారు.

ప్రజల సమస్యలు చెపౌకోవడానికి వేదిక ఉండాలని సీఎం కేసీఆర్ భావించి అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

ఎల్లారెడ్డిపై ప్రేమ ఎక్కువ

బాల్కొండ నియోజకవర్గం తరువాత ఎల్లారెడ్డి నియోజకవర్గంపై తనకు అత్యంత శ్రద్ద ఉంటుందని, నియోజకవర్గ అభివృద్ధికి తాను పూర్తిగా సహకరిస్తానని తెలిపారు.

తన పరిధిలో ఉన్న శాఖల ద్వారా శక్తి మేరకు నిధులు మంజూరు చేస్తానని పేర్కొన్నారు. మంత్రి కేటీఆర్ సహకారంతో మరో 25 కోట్లతో అబివృద్ది పనులకు నిధుల మంజూరుకు కృషి చేస్తానని చెప్పారు.

బండి సంజయ్.. నోరు జాగ్రత్త

దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని పనులు కేసీఆర్ చేశారని తెలిపారు. సోషల్ మీడియా వేదికగా ఇష్టం వచ్చినట్టు బీజేపీ నాయకులు నోరు పారేసుకుంటున్నారని అన్నారు.

రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కి దమ్ము ధైర్యం ఉంటే మీ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కెసిఆర్ కిట్, రైతు బంధు, భీమా, నల్ల నీళ్ళు చూపించాలని డిమాండ్ చేశారు. నోరుందని పొద్దస్తమానం ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని, ప్రజలు అన్ని గమనిస్తున్నారని త్వరలోనే బుద్ధి చెప్తారని హెచ్చరించారు.

నియోజక వర్గ అభివృద్ధి

ఎమ్మెల్యే జాజాల సురేందర్ మాట్లాడుతూ.. గత 30 సంవత్సరాలుగా జరగని అభివృద్ధి నియోజకవర్గంలో జరిగిందన్నారు. కోవిడ్ ఉన్నా మిగతా నియోజకవర్గాల కన్నా ఎల్లారెడ్డి నియోజక వర్గానికి అత్యధిక నిధులు కేటాయించారని, అందుకు మంత్రి ప్రశాంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

మరొక 25 కోట్ల నిధులు మంజూరు చేస్తే ముఖ్యమైన సమస్యలు తీరుతాయని మంత్రిని కోరారు. ఈ కార్యక్రమాల్లో జడ్పీ చైర్మన్ దఫెడర్ శోభ, కలెక్టర్ శరత్, మాజీ మంత్రి నెరేళ్ల ఆంజనేయులు,

మున్సిపల్ చైర్మన్ సత్యనారాయణ, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, వివిధ మండలాల నాయకులు, కార్యకర్తలు, సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు పాల్గొన్నారు.

Related posts

మహా ప్రభంజనంలా తెలుగుదేశం మహానాడు

Satyam NEWS

ఇగో అనడానికి వీల్లేదు… విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు

Satyam NEWS

రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేస్తున్న వైసిసి

Satyam NEWS

Leave a Comment