38.2 C
Hyderabad
May 3, 2024 21: 56 PM
Slider కడప

సిఎం జగన్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా మాట్లాడిన మేనమామ

ravindranathreddy

కరోనా పై ఏపీ సీఎం వైఎస్ జగన్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా సీఎం మేనమామ, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి మాట్లడారు. ఢిల్లీ మర్కజ్ మసీదులో జరిగిన సభలో పాల్గొన్న వారి వల్లే ఏపీలో కరనో వైరస్ వ్యాప్తి చెందిందని ఏపీ సీఎం వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలను కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి కొట్టిపడేశారు.

ఢిల్లీ వెళ్లివచ్చిన ముస్లిం సోదరులలో ఎలాంటి వ్యాధి లక్షణాలు కనిపించడం లేదని ఆయన అన్నారు. వారందరూ ఐసోలేషన్ వార్డుల్లో ఆరోగ్యంగానే ఉన్నారని ఆయన తెలిపారు. వారి నుండి తీసిన శ్యాంపిల్స్ ను పరీక్షించినపుడే కరోనా పాజిటివ్ అని తేలుతోంది. మన ప్రాంతం వారికి ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉంది.

అందువల్ల కరోనా వైరస్ అంటే ఎవరూ భయపడాల్సిన పనిలేదు అని రవీంద్రనాథ్ రెడ్డి వ్యాఖ్యానించారు. కరోనా వైరస్ బలహీనపడిందని దాని తీవ్రత తగ్గినట్లు కనిపిస్తోందని ఆయన అన్నారు. కరోనా వల్ల ఏదో అయిపోతుందన్న హైరానా అవసరం లేదని ఆయన తెలిపారు.

Related posts

‘కొత్త’ను స్వాగతిద్దామిక

Satyam NEWS

పోలీసు స్టేషన్ ఎదుటే పోలీసు ఆత్మహత్యాయత్నం

Satyam NEWS

ఇండియన్ పనోరమాలో తమిళ సినిమా ‘కిడ’కు స్టాండింగ్ ఒవేషన్

Bhavani

Leave a Comment