తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా ఎంపీ రేవంత్ రెడ్డిని ఎంపిక చేయడంతో కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క మొక్కులు చెల్లించుకున్నారు.
పీసీసీ రేసులో ఉన్న రేవంత్ రెడ్డికి ఆ పదవి రావాలని మేడారం అమ్మవారులకు మొక్కుకున్నారు. తాజాగా రేవంత్ రెడ్డికి పీసీసీ పదవి దక్కటంతో ఎమ్మెల్యే సీతక్క మొక్కులు చెల్లించారు.
ఊరేగింపుగా వెళ్లిన సీతక్క అమ్మవారిలకు ప్రదక్షిణలు చేసి. మొక్కు చెల్లించారు. తన సోదరుడు రేవంత్ కు పదవి దక్కటం పట్ల సీతక్క సంతోషం వ్యక్తం చేశారు.
రేవంత్ పీసీసీ పదవి ఇచ్చినందుకు సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలిపారు.