ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నా..కొన్ని జిల్లాల్లో మరో వారం రోజుల పాటు కర్ఫ్యూ సమయాలలో మార్పులు రాబోతున్నాయి.
ఈ నెలాఖరు తో ఉదయం ఆరు నుంచీ సాయంత్రం ఆరువరకు కర్ఫ్యూ సడలింపు ఇవ్వడం జరిగింది. తాజాగా జులై మొదటి వారంలో కూడి ఇవే సడలింపు లు విధించనున్నారు.
వచ్చే నెల నుంచీ ఏడవ తేదీ వరకు ఆరు జిల్లాలో కర్ఫ్యూ సడలింపు ఇచ్చినట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో విజయనగరం జిల్లా ఎస్పీ రాజకుమారీ.. మరోసారి జిల్లా ప్రజలను అప్రమత్తం చేసేందుకు ఆకస్మికంగా నగర రోడ్లపై తిరిగారు.
ఆర్టీసీ కాంప్లెక్స్ మీదుగా బాలాజీ జంక్షన్ వద్ద వాహనాలను సిబ్బంది చేత తనిఖీలు చేయించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఆరు తర్వాత రోడ్ మీద వాహనం కనిపిస్తే జరిమానా తప్పదని హెచ్చరించారు.