కర్ణాటక రాష్ట్రం గాన్గపూర్ దత్తాత్రేయ స్వామి వారి సన్నిధిలో గణేష్ నిమజ్జనోత్సవం జరిపేందుకు నరసింహ బస్తి కమిటీ శనివారం బయలు దేరింది. ఈ కమిటీకి అంబర్పేట్ నియోజకవర్గ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అభినందనలు తెలిపారు. ఎమ్మెల్యే అక్కడ ప్రత్యేక పూజలు చేశారు. ఈ కమిటీ 23 సంవత్సరాల నుంచి ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో వినాయక నిమజ్జనం చేస్తున్నది. ఈ కార్యక్రమంలో బస్తి కమిటీ అధ్యక్షులు ఎం భూపతినాథ్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, నల్లకుంట టిఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు మేడి ప్రసాద్, నగర ఓబీసీ కాంగ్రెస్ కార్యదర్శి సుభాష్, నగర దళిత మోర్చా ఉపాధ్యక్షులు లక్ష్మణ్, జనసేన పార్టీ నగర కన్వీనర్ ఎస్ బాబురావు, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గాలపల్లి శంకర్, ధనుంజయ, మూర్తి, నందు, కాంపల్లి ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు.
సత్యం న్యూస్, అంబర్పేట్