మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గా పని చేసి బదిలీపై వెళ్తున్న సుభాష్ ను శనివారం తెలంగాణ రాష్ట్ర లారీ యజమానుల సంఘం సభ్యులు ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా కౌన్సిల్ సభ్యుడు కోతి సంపత్ రెడ్డి మాట్లాడుతూ గడిచిన మూడున్నర సంవత్సరాలుగా కోదాడ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సుభాష్ సౌమ్యుడిగా,రవాణా రంగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అనేక సమీక్షలు జరుపుతూ తన పరిధిలోని కోదాడ పరిసర ప్రాంత ప్రజలకే కాకుండా 7 నెలల పాటు సూర్యాపేట జిల్లా ఇన్చార్జి ఆర్.టి.ఓ.గా తన విశిష్ట సేవలు సూర్యాపేట జిల్లాకి కూడా అందించిన విషయాన్ని,రవాణా రంగంపై ఆధారపడిన వ్యక్తులే కాకుండా వారితో పరిచయం ఉన్న ఎవరూ కూడా మర్చిపోలేరని అన్నారు.
బదిలీపై వెళ్ళిన కామారెడ్డి ప్రాంతంలో కూడా వారి విశిష్ట సేవలు అందిస్తారని సంపత్ రెడ్డి తన హర్షాన్ని వ్యక్తం చేశారు.ఉద్యోగ ధర్మం రిత్యా బదిలీలు సహజమని తెలియజేస్తూ హుజూర్ నగర్ లారీ యజమానుల సంఘం అధ్యక్షుడు శంకర్రావు,గౌరవ అధ్యక్షుడు దొంతిరెడ్డి సంజీవరెడ్డి, గౌరవ సలహాదారులు కొండలు, జాయింట్ సెక్రెటరీ రవి,కమిటీ సభ్యులు సత్యనారాయణ తో కలిసి ఎం.వి.ఐ సుభాష్ కు పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సన్మానం చేశారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్