విజయనగరం జిల్లా కొత్త కలెక్టర్ వచ్చిన వేళ విషయమో లేక కాకతాళీయమో…మరో సంఘటన జరిగింది. కొత్త కలెక్టర్ గా చార్జ్ తీసుకున్న సమయంలో పవర్ కట్ అవడం ఒక్క టైతే తాజాగా కలెక్టరేట్ లోపల ఓ వ్యక్తి గొంతు కోసుకున్నాడు. విజయనగరం కలెక్టరేట్ ఆవరణలో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు…అదీ స్పందన జరిగే సమయానికి గంట ముందు రాజు అనే వ్యక్తి… ఓ అద్దం ముక్క తో డీఆర్ఓ ఛాంబర్ సమీపంలో 8.30 కు ఒక్క సారి గా గొంతు కోసుకోసుకుని అక్కడే కూలిపోయాడు.
అదే సమయంలో కలెక్టరేట్ కు వచ్చిన డీఆర్ఓ కు విషయం తెలియడంతో వెంటనే పోలీసులకు సమాచారం తెలిపి హుటాహుటిన జిల్లా కేంద్ర సర్వ జన హాస్పిటల్ కు తరలించారు. ప్రధమ చికిత్స అనంతరం సదరు వ్యక్తి కి..ఆపరేషన్ చేస్తున్నారు…వైద్య సిబ్బంది. ఇదే విషయం పై ఏఓ శ్రీకాంత్ మాట్లాడుతూ…తెలుగు లో మాట్లాడటం లేదని.. పోలీసులకు ఫిర్యాదు చేసామన్నారు.