26.7 C
Hyderabad
May 16, 2024 08: 52 AM
Slider ముఖ్యంశాలు

కరోనా దెబ్బకు నావికాదళాల విన్యాసాల సదస్సు వాయిదా

navy

విశాఖలో జరగాల్సిన పలు దేశాలకి చెందిన నావికాదళాల విన్యాసాల  సదస్సు మిలన్ – 2020 పై కోవిడ్ – 19 వైరస్ దెబ్బ పడింది. ఈ నెల 18 నుంచి 28 వరకు విశాఖ సాగర తీరంలో మిలాన్ – 2020 జరగాల్సి ఉంది. ప్రపంచ దేశాల్లో కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో భారత నావికాదళం అప్రమత్తం అయింది.

వివిధ దేశాల సైనికుల బృందాలు రాకపోకలు సాగించనున్న నేపథ్యంలో కరోనా వైరస్ వ్యాప్తికి అవకాశాలు ఉన్నాయని  కేంద్ర ప్రభుత్వ వైద్య నిపుణలు హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపద్యంలో మిలాన్ -2020 నావికాదళాల విన్యాసాల సదస్సును వాయిదా వేస్తున్నట్లు తూర్పు నావికాదళం ప్రకటించింది. ఎప్పుడు నిర్వహించేది మరోసారి చెబుతామని నావికాదళం తెలిపింది.

Related posts

4వ విడత ప్రజా సంగ్రామ యాత్ర విజయవంతం కావాలని పూజలు

Satyam NEWS

సోనియా జన్మదినం సందర్భంగా పండ్లు పంపిణీ

Satyam NEWS

హుజూరాబాద్ ఉప ఎన్నిక‌పై దృష్టి సారించిన బిజెపి

Satyam NEWS

Leave a Comment