తెలంగాణ తల్లి సోనియా గాంధి 78వ జన్మదిన సందర్బంగా ఫీవర్ హాస్పిటల్ చౌరస్తా లో కేక్ కట్ చేసి కోరేంటి హాస్పిటల్ లో పేషెంట్స్ కు పండ్లు పంపిణి చేశారు. ఈ కార్యక్రమాన్ని కే.పీ మురళీ కృష్ణ, కుతాడి రవి కుమార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా రోహిన్ రెడ్డి ఖైరతబాద్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పాల్గొన్నారు. అంబర్పేట్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు, డివిజన్ అధ్యక్షులు, కార్యకర్తలు, హాస్పిటల్ డాక్టర్లు, నర్సులు, హాస్పిటల్ సిబ్బంది పాల్గొని ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. సోనియా గాంధీ జన్మదిన సందర్బంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, ఆరోగ్యశ్రీ పథకం అమలలోకి తేవడం చారిత్రాత్మక నిర్ణయం అన్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉంటారని స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయం జరుగుతుందని రోహిన్ రెడ్డి తెలిపారు.
సత్యం న్యూస్, అంబర్పేట్