38.2 C
Hyderabad
May 5, 2024 20: 41 PM
Slider ముఖ్యంశాలు

హుజూరాబాద్ ఉప ఎన్నిక‌పై దృష్టి సారించిన బిజెపి

#Bandi Sainjai

భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జులై 4వ తేదీన మధ్యాహ్నం ఒంటిగంటకు హైద‌రాబాద్ నాంప‌ల్లిలోని రాష్ట్ర కార్యాలయంలో జరగనుంది.

ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు  బండి సంజయ్ కుమార్ అధ్యక్షత వహిస్తారు. ఈ స‌మావేశంలో ప‌లు  కీలక అంశాలపై చర్చించనున్నారు.

వర్చువల్ రూపంలో జరగనున్న ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్  తరుణ్ చుగ్  హాజరవుతారు.

ఈ  రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి  కిషన్ రెడ్డి , బిజెపి జాతీయ ఉపాధ్యక్షులు  డీకే అరుణ,  బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డా.కె. లక్ష్మణ్ , ఇతర జాతీయ, రాష్ట్ర నాయకులు పాల్గొంటారు.

ఈ  పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో రైతుల సమస్యలు, కృష్ణా జలాలు, నిరుద్యోగ సమస్య, హుజురాబాద్ ఉపఎన్నికలపై చర్చ జరుగనుంది.  అదేవిధంగా వర్చువల్ రూపంలో జరగనున్న రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో  పదాధికారులు,పార్టీ సీనియర్ నేత‌ లు, జిల్లాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, పార్టీ రాష్ట్ర‌ కార్యవర్గ సభ్యులు మరియు మాజీ ఎమ్మెల్యేలు పాల్గొంటారు.

Related posts

అమరావతి కి సంఘీభావం గా రాజంపేట టీడీపీ నేతల దీక్ష

Satyam NEWS

భగత్ సింగ్ జయంతి సందర్భంగా ఘన నివాళి

Satyam NEWS

విశాఖ రేంజ్ డీఐజీ కళ్ల ముందే నిబంధనల ఉల్లంఘన…!

Satyam NEWS

Leave a Comment