తెలంగాణా రాష్ట్ర బిజెపి అధ్యక్షులు బండి సంజయ్ చేపట్టిన నాల్గొవ విడత ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా సోమవారం రామంతాపూర్ హబ్సిగూడ కార్పొరేటర్లు బండారు శ్రీ వాణి, కక్కిరేణి చేతన హరీష్ లు కుత్బుల్లాపూర్ లోనీ చిత్తారమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రామ్ లీలా మైదానంలో సభ ప్రాంగణంలో బండి సంజయ్ కుమార్ ని కలిసి నాల్గొవ విడత ప్రజాసంగ్రామ యాత్ర విజయవంతం కావాలని ఆశిస్తూ వారికి మద్దతు తెలిపారు.
ఈ కార్యక్రమంలో రామంతపూర్ డివిజన్ బిజెపి అధ్యక్షులు బండారు వెంకట్రావు, రేవు నరసింహ కురుమ, ప్రధాన కార్యదర్శులు సుంకూర్ కుమార స్వామి, పులికొండ నారాయణదాసు, కందగట్ల దయానంద రెడ్డి, వేముల వెంకటరెడ్డి, పడిగం నాగేష్, మహేశ్వర్ రెడ్డి, వేముల తిరుపతయ్య, పలు డివిజన్ల బిజెపి నాయకులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి