ప్రజా సమస్యలపై పోరాటం చేసేందుకు నవతరంపార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన “నేనున్నా మీకోసం” కార్యక్రమం పునఃప్రారంభం చేస్తున్నట్లు నవతరంపార్టీ జాతీయ అధ్యక్షుడు రావుసుబ్రహ్మణ్యం ప్రకటన చేశారు. మంగళవారం చిలకలూరిపేట కార్యాలయంలో ఈ మేరకు కరపత్రాలు విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో నేతలు ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజా సమస్యలపై అధికారులకు వినతిపత్రాలను ఇవ్వాలని నిర్ణయించారు. కార్యక్రమంలో బాపట్ల జిల్లా అధ్యక్షుడు నలమాల తిరుపతి రావు,పర్చూరు నియోజకవర్గ కార్యదర్శి సిద్దు ఆత్మలింగాచారి, యద్దనపూడి మండల అధ్యక్షుడు గోనుగుంట్ల వెంకట సుబ్బారావు, ఉపాధ్యక్షుడు కొత్తమాసు నాగేశ్వరరావు పాల్గొని కరపత్రాలు విడుదల చేశారు.ప్రజలందరికి విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు.
previous post