27.7 C
Hyderabad
May 4, 2024 08: 41 AM
Slider రంగారెడ్డి

NEET పరీక్షలలో ఆల్ ఇండియా 219 వ ర్యాంక్ సాధించిన ఎ.వి.చరణ్

#uppalmla

NEET పరీక్షలలో ఆల్ ఇండియా 219 వ ర్యాంక్ , OBC కేటగిరి లో 46 వ ర్యాంక్ సాదించిన  శ్రీ వాగ్దేవి టెక్నో స్కూల్ పూర్వ విద్యార్థి A.V చరణ్ ని ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి నేడు సన్మానించారు. మేడ్చల్ జిల్లా కాప్రా సర్కిల్ మీర్పేట్ హెచ్ బి కాలనీ డివిజన్లో నివాసం ఉండే వారి తల్లిదండ్రులు A. శ్రీనివాసరావు మాలతి లను హబ్సిగూడ లోని  ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సన్మానించారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి తో బాటు స్థానిక కార్పొరేటర్ జెర్రిపోతుల ప్రభుదాస్ లు పాల్గొన్నారు. వారికి పుష్పగుచ్ఛం అందజేసి శాలువతో సత్కరించి  అభినంద నలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ భవిష్యత్ లో మరిన్ని విజయాలు సాధించి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మీర్పేట్ హెచ్ బి కాలనీ టిఆర్ఎస్ నాయకులు రామకృష్ణ, శేఖర్ గౌడ్, వాసు, అరటికాయల భాస్కర్, గరిక సుధాకర్ ఎండీ ముస్తాక్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

రేవంత్ రెడ్డి రాజీవ్ రైతు పాదయాత్రలో వనపర్తి కాంగ్రెస్ నేతలు

Satyam NEWS

నాగులచవితితో లాభాలేంటీ?

Sub Editor

చర్చలు సఫలం కార్మికుల సమ్మె విరమణ: సిఐటియు

Satyam NEWS

Leave a Comment