సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ మేళ్ళచెరువు మండలం రామాపురం ప్రియా సిమెంట్ కర్మాగారంలో గడిచిన ఎనిమిది రోజులుగా కార్మికులు చేపట్టిన సమ్మె విరమిస్తున్నట్లు,ఇది కార్మికుల ఐక్య పోరాట విజయమని సి ఐ టి యు రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు శీతల రోషపతి తెలిపారు.
రామాపురంలో గత ఎనిమిది రోజుల నుండి జరుగుతున్న సమ్మె గురువారం తో ముగించినట్లు ప్రియా సిమెంట్ యాజమాన్యం,కంటాక్టర్స్,సి ఐ టి యు ప్రతినిధులు సుదీర్గ చర్చల అనంతరం లేబర్ యాక్ట్ ప్రకారం క్యాటగిరి మార్చుటకు లేబర్ ఆక్ట్ ప్రకారం వేతనాలు, బోనస్,గ్రాడ్యుటీ ఇతర అలవెన్సులు జూలై నెల నుండి ఇచ్చుటకు అంగీకరించారని, దీంతో ఎనిమిది రోజులుగా చేస్తున్న సమ్మె విరమించినట్లు కార్మిక ప్రతినిధులు తెలిపినారు.
ఈ కార్యక్రమంలో ప్రియా సిమెంట్ యాజమాన్యం తరపున డి జి ఎం సిహెచ్ వెంకటేశ్వరరావు, మెళ్ళచెరువు ఎస్ఐ నరేష్,ఎఎస్సై ఆనంద్,సిఐటియు నాయకులు, గ్రామ పెద్దల సహకారంతో ఒప్పందం జరిగినట్లు తెలిపినారు.చర్చల్లో కాంట్రాక్టర్స్ కమలపాండే రాఘవరావు,అన్సారీ,గిరి, నాగేశ్వరావు,కృష్ణారెడ్డి,సి ఐ టి యు ప్రతినిధులు శీతల రోషపతి,తీగల శ్రీను, వి.నాగేశ్వరరావు,హరికృష్ణ,నాగేశ్వరరావు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్ హుజూర్ నగర్