సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం పాలకీడు మండలం ముసివొడ్డు సింగారం గ్రామంలో MGNREGS నిధులతో పనులు ప్రారంభమయ్యాయి. 15 లక్షలు రూపాయలతో నూతన చెరువు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా MLA శానంపూడి సైదిరెడ్డి హాజరయ్యారు.
పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం ఎమ్మెల్యే గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకులు, బియ్యం, కూరగాయలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు.