27.7 C
Hyderabad
May 16, 2024 05: 47 AM
Slider ముఖ్యంశాలు

ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన లేదు: కేసీఆర్

ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన లేదని తెరాస అధినేత, సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో జరిగిన తెరాస విస్తృతస్థాయి సమావేశంలో సీఎం కేసీఆర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో షెడ్యూల్‌ ప్రకారమే శాసనసభ ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. పార్టీ శ్రేణులంతా ఎన్నికలకు సిద్ధం కావాలని సూచించారు. ఇప్పటి నుంచే ఎమ్మెల్యేలు, నేతలు ప్రజల్లోనే ఉండాలని దిశానిర్దేశం చేశారు.

వచ్చే ఎన్నికలకు సన్నద్ధతపై పార్టీ సమావేశంలో చర్చించారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే అంశంపై సమావేశంలో చర్చ జరిగింది. తెరాస ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్, డీసీసీబీ, డీసీఎంఎస్, రైతు బంధు జిల్లా కమిటీలు, కార్పొరేషన్ల ఛైర్మన్లతో పాటు పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సమావేశానికి హాజరయ్యారు.

Related posts

సోషల్ మీడియా చక్రబంధంలో ఇరుక్కున్న కేటీఆర్

Satyam NEWS

సిఎం జగన్ బావ బ్రదర్ అనిల్ కారుకు ప్రమాదం

Satyam NEWS

ఘనంగా జరిగిన మార్కండేయ స్వామి జయంతి ఉత్సవాలు

Satyam NEWS

Leave a Comment