కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్ పోస్ట్ వద్ద బ్రదర్ అనిల్ కుమార్ ప్రయాణిస్తున్న కారు స్వల్ప ప్రమాదానికి గురి అయింది. కారులో బ్రదర్ అనిల్ కుమార్ తో పాటు గన్ మెన్, డ్రైవర్ ఉన్నారు. అయితే వారికి ఎలాంటి గాయాలు కాలేదు. కారు మాత్రం పూర్తిగా ధ్వంసం అయింది. విషయం తెలియడంతో ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు.
ఉదయభాను కారులో బ్రదర్ అనిల్ కుమార్, డ్రైవర్, గన్ మెన్ లను విజయవాడలోని ఎం జె. నాయుడు హాస్పిటల్ కి తరలించారు. ప్రధమ చికిత్స అనంతరం తన పర్యటన కు బ్రదర్ అనిల్ కుమార్ వెళ్లిపోయారు. బ్రదర్ అనిల్ కుమార్ ఏపి ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి బావ అవుతారు.