27.7 C
Hyderabad
May 4, 2024 10: 05 AM
Slider ముఖ్యంశాలు

కేసీఆర్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్

#nvssprabhakar

ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర రక్షణ రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్

ఈ సారి ఎన్నికలలో గెలిచేది నేనేనని ఉప్పల్ బిజేపి అభ్యర్థి ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు. గురువారం ప్రభాకర్ నామినేషన్ వేశారు. ఉదయం సత్యనారాయణ స్వామి ఆలయంలో పూజలు చేసి ర్యాలీగా నామినేషన్ వేయడానికి బయలుదేరారు. ఈ ర్యాలీలో  ముఖ్యఅతిథిగా విచ్చేసిన కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్టుతోపాటు కార్పొరేటర్లు కక్కిరేణి చేతన హరీష్,  బండారు శ్రీవాణి వెంకట్రావు లతో కలిసి, పబ్లిక్ స్కూల్ నుంచి పెద్ద ఎత్తున ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు.‌ ఈ సందర్భంగా ప్రభాకర్ మీడియా తో మాట్లాడుతూ ప్రజల ఆశీర్వాదంతో ఈసారి తాను కచ్చితంగా గెలిచి అసెంబ్లీ లో అడుగుపెడతానని ధీమా వ్యక్తం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయింది. ఉప్పల్ లో ఆగిపోయిన అభివృద్ధి మళ్లీ తిరిగి ప్రారంభం కావాలంటే ప్రభాకర్ గెలవాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. ఈసారి పోరు రసవత్తరంగా వుంటుందని ప్రభాకర్ అన్నారు. ఓ వైపు దళారులు, కాంట్రాక్టర్లు, రాజకీయ అవకాశవాదులు, పార్టీ లు మారి కొత్త కొత్త అవతారాలు ఎత్తిన వాళ్లు ఒకవైపు, ప్రజల కోసం, ప్రగతి కోసం, ఉప్పల్ భవిష్యత్తు కోసం పని చేసే నేను బరిలో వున్నన్నారు. నిత్యం ప్రజల్లో వుంటూ, ప్రజా సమస్యలపై పోరాటం చేసే నన్ను ప్రజలు ఆదరిస్తారన్న నమ్మకం వుందని చెప్పారు.

ఉప్పల్ నియోజకవర్గంలో ఆగిపోయిన అభివృద్ధి మళ్లీ చిగురించాలంటే ప్రభాకర్ గెలవాలని‌ ప్రజలు బలంగా కోరుకుంటున్నారని అన్నారు. తనకు ఈ అవకాశం ఇచ్చిన పార్టీ కి , తనను మరోసారి గెలిపించుకొని ఉప్పల్ అభివృద్ధి ని కళ్లారా చూడాలనుకుంటున్న ప్రజలకు కృతజ్ఞతలు అని ప్రభాకర్ పేర్కొన్నారు. ఉప్పల్ ప్రజలకు జీవితాంతం రుణపడి వుంటానని అయన చెప్పారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పెద్ద ఎత్తున జనసేన కార్యకర్తలు మహిళలు యువకులు  పాల్గొన్నారు.

సత్యం న్యూస్, మేడ్చల్ జిల్లా

Related posts

స‌త్య‌దేవ్‌, సి. క‌ల్యాణ్ కాంబినేష‌న్ ఫిల్మ్ టైటిల్ ‘గాడ్సే’

Satyam NEWS

శ్రీ కోదండరామాలయంలో శాస్త్రోక్తంగా పవిత్ర స‌మ‌ర్ప‌ణ‌

Satyam NEWS

దరువు అంజన్నకు జానపద కళానిది బిరుదు ప్రదానం

Satyam NEWS

Leave a Comment