ఉప్పల్ లో బిఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేయడం ఖాయమని ఉప్పల్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి అన్నారు. గురువారం ఉప్పల్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బండారి లక్ష్మారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. బి ఆర్ ఎస్ పార్టీ ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి, బియారెస్ మాజీ రాష్ట్ర కార్యదర్శి తాడూరి శ్రీనివాస్, కార్పొరేటర్లు బొంతు శ్రీదేవి, జేరిపోతుల ప్రభుదాస్ ల తో కలిసి నామినేషన్ పత్రాలను ఉప్పల్ రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయంలో బండారి లక్ష్మారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో సైనికపురి నుండి దారి పొడవునా ప్రజా ఆశీర్వాదాలతో ఉప్పల్ కు చేరుకొని నామినేషన్ దాఖలు చేశారు.
ముందుగా కాప్రా డివిజన్ లోనీ జ్యోతి రావు పూలే విగ్రహానికి పులమాల వేసి నివాళులు అర్పించారు. ప్రజలు, నాయకులు, కార్యకర్తలు, భారీగా తరలివచ్చి బండారి లక్ష్మారెడ్డి కి బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా లక్ష మెజారిటీతో గెలవాలంటూ ప్రజలు దీవించారు. నాచారంలో వీర తిలకం దిద్ది, మంగళ హారతులతో విజయోస్తంటూ దీవించి ,గులాబీ సైన్యంతో ఘనంగా స్వాగతం పలుకుతూ, గులాబీ పూలు జల్లుతూ, పూలమాలలు వేసి సత్కరించారు. ఈ సందర్బంగా బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ తనని నిండు మనస్సుతో దీవించిన మహిళా సోదరీమణుల ఆశీర్వాదాలతో వారి దీవెనలతో నామినేషన్ వేయడం చాల సంతోషంగా ఉందనీ అన్నారు.
అందరి మద్దతుతో ఉప్పల్ నియోజకవర్గంలో భారీ మెజారిటీతో గెలిచి, గులాబీ జెండాను ఎగరేస్తామని బండారి లక్ష్మారెడ్డి గెలుపు ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు సింగిరెడ్డి శిరీషారెడ్డి, జెరిపోతుల ప్రభుదాస్, బొంతు శ్రీదేవి,జిఎహెఎంసీ స్టాండింగ్ కమిటీ మెంబర్, శాంతి సాయిజెన్ శేఖర్ దంపతులు, పన్నాల దేవేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, మేడ్చల్ జిల్లా