వైసీపీ పాలనలో ప్రజల పై ఇంటి,చెత్త పన్నుల భారాలు,కరెంట్ కోతలు,చార్జీల మోత తప్ప జరిగిన అభివృద్ధి శూన్యమని,ప్రభుత్వం పై ప్రజలు తిరగబడే సమయం పల్నాడు జిల్లా నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద అన్నారు. నరసరావుపేట పట్టణ శివారులోని వినుకొండ రోడ్ గల ఆర్టీసీ కాలనీ నందు మంగళవారం బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికీ తిరిగి పెరిగిన ధరల పై ప్రజలకు అవగాహన కల్పిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు.చంద్రన్న బీమా,నిరుద్యోగ భృతి,విద్యాదీవెన,వివాహ కానుకలు,పండుగ తోఫాలు ఏమైపోయాయని ప్రశ్నించారు.బాదుడే బాదుడు కార్యక్రమం ప్రజల్లో చైతన్యం తెచ్చిందని,వైసీపీ ప్రభుత్వాన్ని త్వరలోనే ప్రజలు బాదుతారని ఆయన హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
previous post