నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం లో జరుగుతున్న అక్రమ భూకబ్జాలపై బిజెపి గళమెత్తింది. పెద్దకొత్తపల్లి మండల అధ్యక్షులు పధిర బీమేష్ ఆధ్వర్యంలో భూకబ్జాలు జరుగుతున్నాయని బిజెపి నాయకులు ఆరోపించారు. భూ కబ్జాలకు వ్యతిరేకంగా చేపట్టిన నిరసన కార్యక్రమం అనంతరం బిజెపి నేతలు MRO కి వినతి పత్రాన్ని అందజేశారు.
మొదటగా పెద్దకొత్తపల్లి చౌరస్తా నుంచి నినాదాలతో ర్యాలీ గా బిజెపి నేతలు ఎంఆర్ఓo ఆఫీస్ కు చేరుకున్నారు. అనంతరం బిజెపి మండల అధ్యక్షులు, sc మోర్చా రాష్ట్ర కార్యదర్శి, నేతలు మాట్లాడుతూ పెద్దకొత్తపల్లి మండలంలో టిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు అక్రమ భూకబ్జాలకు పాల్పడుతున్నారని తెలిపారు.
అటవీ భూములను అక్రమంగా కబ్జాలు చేసి తమ పేర్ల మీద రిజిస్టర్ చేసుకుంటున్నారని బిజెపి నేతలు ఆరోపించారు. వారు మాట్లాడుతూ ప్రజలకు సేవలు అందించాల్సిన ప్రభుత్వ అధికారుల సైతం భూ కబ్జా దారులకు ఒత్తసు పలకడం నిజంగా ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు.
పెద్దకొత్తపల్లి మండలంలో మారేడు దీన్నే పరిధిలో తెరాస ప్రజా ప్రతినిధులు ఆక్రమించుకున్న భూములను వెంటనే తీసుకొని వాటిని సామాన్యూలయిన పేద ప్రజలకు పంచే విధంగా చూడాలని బిజెపి నేతలు అన్నారు.
సరిగ్గా ఏడు రోజులు గడువు ఇస్తున్నామని ఈ లోపు కబ్జాకు గురైన భూములను వెంటనే రిటర్న్ తీసుకోవాలని లేకపోతే ఎమ్మార్వో ఆఫీస్ ను భారీ సంఖ్యలో కార్యకర్తలు, రైతులతో వచ్చి ముట్టడిస్తామని బిజెపి నేతలు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల, రాష్ట్ర, జిల్లా వివిధ మోర్చాలా నాయకులు పాల్గొన్నారు.