పాత స్నేహితులు ఎక్కడో ఒకచోట కలిస్తే ఆ సంతోషం వేరే.. అలాంటిది ఎప్పుడో చదువుకుని ఏళ్ల తర్వాత కలిస్తే ఆ సంతోషానికి అవధులు ఉండవు. 2008 -10 బ్యాచ్ కు చెందిన డైట్ విద్యార్థులు సోమవారం నిజామాబాద్ లోని డైట్ కళాశాలలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్బంగా కామారెడ్డి జిల్లాకు చెందిన ఉపాధ్యాయులు వెళ్లారు. ఆనాటి స్మృతులను, జ్ఞాపకాలను ఒకరికొకరు పంచుకున్నారు. అనంతరం తమకు ఉపాధ్యాయ శిక్షణ ఇచ్చిన అధ్యాపకులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో డైట్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్, అధ్యాపకులు లచ్చయ్య, మహేష్ బాబు, రామచందర్, సుదర్శన్ పాల్గోన్నారు.