తిరుమల తిరుపతి దేవస్థానం మెడికల్ అడ్వైజర్ డాక్టర్ శ్వేతా తన్నీరు ఫ్రంట్ లైన్ వర్కర్లకు కరోనా కిట్ లు విరాళంగా అందచేశారు.
ఈరోజు తిరుమలలో టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి చేతుల మీదుగా టిటిడి ఉద్యోగులకు, పారామెడికల్ సిబ్బందికి, టీటీడీ ఫ్రంట్ లైన్ వర్కర్లకు వీటిని అందచేశారు.
మొత్తం 2500 మందికి వీటిని అందించారు. వీటి విలువ సుమారు 5 లక్షల రూపాయల వరకూ ఉంటుంది. ఈ కరోనా రక్షణ కిట్ల లో 5 మాస్కులు, 1 శానిటైజర్ బాటిల్ ఉంటుంది.
కె.రమాకాంత్