పులివెందులలో మంగళవారం మధ్యాహ్నం పాత్రికేయుడు మరియు సిబిఐ విచారణ ఎదుర్కొంటున్న భరత్ యాదవ్ అనే వ్యక్తి ఇరువురి యువకులపై జరిపిన కాల్పుల్లో దిలీప్ అనే యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందగా మస్తాన్ అనే యువకుడు గాయపడ్డాడు. భరత్ యాదవ్ ఇద్దరిపై సమీపం నుంచి తుపాకీ తో కాల్పులు జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ సంఘటనలో దిలీప్,మస్తాన్ అనే ఇద్దరు గాయపడటంతో వారిని పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ దిలీప్ అనే యువకుడు మృతి చెందారు. కాగా దిలీప్, మస్తాన్ ఇరువురు బావ బామ్మర్దులు కావడం విశేషం. ఈ సంఘటన వెనుక ఆర్థిక లావాదేవీలు ఉండడంవల్ల కాల్పులు జరిపినట్లు సమాచారం. మాజీ మంత్రి వైయస్ వివేకా హత్య కేసులో పలుమార్లు సిబిఐ అధికారులపై ఆరోపణలు చేసిన భరత్ యాదవ్ను అధికారులు విచారించడం తెలిసిందే. భరత్ యాదవ్ ఓ పత్రికలో పాత్రికేయుడుగా పనిచేస్తున్నారు. ఘటన పై కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు వెల్లడించారు.
previous post