26.7 C
Hyderabad
May 3, 2024 10: 45 AM
Slider గుంటూరు

జగన్ రెడ్డి అసమర్థ పాలనతో పోలవరం భవిష్యత్  ప్రమాదం

#chadalawada

టీడీపీ హయాంలో పోలవరాన్ని 71 శాతం పూర్తి చేస్తే 4 ఏళ్లల్లో జగన్ కేవలం 7 శాతం పనులే పూర్తి చేశారని,జగన్ రెడ్డి అసమర్థ పాలనలో పోలవరం భవిష్యత్తు ప్రశ్నర్ధకం గా మారిందని పల్నాడు జిల్లా నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయాలని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో నరసరావుపేట పట్టణంలోని గాంధీ పార్క్ వద్ద నిరసన దీక్ష  నిర్వహించారు.

ఈ సందర్భంగా నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ నియోజకవర్గ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు సంఘీభావం తెలిపారు. అనంతరం డా౹౹చదలవాడ మాట్లాడుతూ పోలవరం పూర్తి అయ్యి ఉత్తరాంధ్ర, రాయలసీమలు సస్యశ్యామలం అవ్వటం జగన్ కు ఇష్టం లేదు అన్నారు. అన్ని ప్రాంతాల్లో నీరు సమృద్ధిగా పారితే ప్రజల దగ్గర నిధులు ఉంటాయి,అప్పుడు జగన్ రెడ్డి ఆడే బూటకపు సంక్షేమ నాటకం,ప్రాంతాల మధ్య చిచ్చు వంటివి  భయటపడతాయన్న భయంతోనే పోలవరాన్ని కావాలని అటకెక్కించారన్నారు.

అందుకే పోలవరం పూర్తికి జగన్ అడుగు ముందుకు వేయడం లేదు అన్నారు. నిధులు ఇవ్వమని, టీడీపీ ఆమోదింపజేసుకున్న డీపీఆర్ -2 ఆమోదించమని కేంద్రం పై ఒత్తిడి తేవటం లేదని పేర్కొన్నారు. పోలవరం ఎత్తు తగ్గించి బహుళార్ధక సాధక ప్రాజెక్టును ఎత్తిపోతల పథకం మార్చిన హీన చరిత్ర జగన్ దని డా౹౹చదలవాడ మండిపడ్డారు.ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రొంపిచర్ల మాజీ ఎంపీపీ మండితోక రామారావు,చల్లగుండ్ల హరికృష్ణ,వెన్న శివారెడ్డి,సిపిఐ,సిపిఎం నాయకులు పాల్గొన్నారు.

Related posts

CITU ఆధ్వర్యంలో మహిళలకు సన్మానం

Satyam NEWS

తెలంగాణలో త‌గ్గుముఖం ప‌ట్టిన కరోనా కేసులు

Sub Editor

బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ దేశానికి ముప్పులా తయారయ్యాయి

Bhavani

Leave a Comment