భారత్ ఐదు కాదు కదా 500 రాఫెల్ యుద్ధ విమానాలను తెప్పించుకున్నా పాకిస్తాన్ వాటిని దీటుగా ఎదుర్కొంటుందని ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ డైరెక్టర్ జనరల్ మేజర్ జర్నల్ బాబర్ ఇఫ్తికార్ అన్నారు.
ఫ్రాన్స్ నుంచి భారత్ ఐదు రాఫెల్ యుద్ధ విమానాలను తెప్పించుకునే సమయంలో చేసిన పబ్లిసిటీ వారి అభద్రతాభావాన్ని సూచిస్తుందని ఆయన అన్నారు.
ప్రపంచంలోని అన్ని దేశాల కన్నా ఎక్కువగా భారత్ రక్షణ రంగంపై ఖర్చు చేస్తున్నదని ఇది వారి యుద్ధ కాంక్షను వ్యక్తం చేస్తున్నదని ఆయన అన్నారు. భారత్ రక్షణ రంగంలో చేస్తున్న ఖర్చు తో ఆసియా ఖండంలో ఉద్రిక్తతలు పెరిగిపోతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
జమ్మూ కాశ్మీర్ ను ఆక్రమించుకున్న భారత్ అక్కడ అణచివేత విధానాలను అవలంబిస్తున్నదని ఇఫ్తికార్ అన్నారు. జమ్మూ కాశ్మీర్ లో ప్రజాస్వామ్యం లేకుండా చేస్తున్నదని భారత్ ను ఆయన తీవ్రంగా విమర్శించారు.