హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో జమ్మూ లో శ్రీవారి ఆలయం నిర్మించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం సంసిద్ధమౌతున్నది. అదే విధంగా ప్రధాని నరేంద్రమోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో కూడా తిరుమల శ్రీవారి ఆలయం నిర్మించబోతున్నారు. ఈ మేరకు టీటీడీ పాలకమండలి నిర్ణయించిందని టీటీడీ ఈవో అనిల్కుమార్ సింఘాల్ పేర్కొన్నారు.
నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ జమ్మూ ప్రభుత్వం ఇందుకోసం ఏడు ప్రాంతాలను ప్రతిపాదించిందన్నారు. నాలుగు ప్రాంతాలు శ్రీవారి దేవాలయ నిర్మాణానికి అనుకూలంగా ఉన్నట్లు గుర్తిం చామన్నారు. ఈ ఏడాదిలోనే జమ్ములో శ్రీవారి ఆలయ నిర్మాణం ప్రారంభిస్తామన్నారు. తిరుమలలో జనవరిలో స్వామివారిని 22.9 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారన్నారు. 1.01 కోట్ల లడ్డు ప్రసాదం విక్రయించామన్నారు. జనవరిలో శ్రీవారి హుండీ ఆదాయం రూ.94.9 కోట్లు సమకూరినట్లు పేర్కొన్నారు.