23.2 C
Hyderabad
May 7, 2024 23: 49 PM
Slider ఆధ్యాత్మికం

యువర్ హైనెస్: హిమాలయాల సమీపంలో శ్రీవారి ఆలయం

tirumala

హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో జమ్మూ లో శ్రీవారి ఆలయం నిర్మించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం సంసిద్ధమౌతున్నది. అదే విధంగా ప్రధాని నరేంద్రమోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో కూడా తిరుమల శ్రీవారి ఆలయం నిర్మించబోతున్నారు. ఈ మేరకు టీటీడీ పాలకమండలి నిర్ణయించిందని టీటీడీ ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ పేర్కొన్నారు.

నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ జమ్మూ ప్రభుత్వం ఇందుకోసం ఏడు ప్రాంతాలను ప్రతిపాదించిందన్నారు. నాలుగు ప్రాంతాలు శ్రీవారి దేవాలయ నిర్మాణానికి అనుకూలంగా ఉన్నట్లు గుర్తిం చామన్నారు. ఈ ఏడాదిలోనే జమ్ములో శ్రీవారి ఆలయ నిర్మాణం ప్రారంభిస్తామన్నారు. తిరుమలలో జనవరిలో స్వామివారిని 22.9 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారన్నారు. 1.01 కోట్ల లడ్డు ప్రసాదం విక్రయించామన్నారు. జనవరిలో శ్రీవారి హుండీ ఆదాయం రూ.94.9 కోట్లు సమకూరినట్లు పేర్కొన్నారు.

Related posts

కాచిగూడ రైల్వే అండర్ బ్రిడ్జి రోడ్డు నిర్మాణానికి మోక్షం

Satyam NEWS

లాక్ డౌన్ కారణంగా ముంచుకొస్తున్న మరో ముప్పు

Satyam NEWS

3808 చెక్కులకు గాను రూ.16.11 కోట్లు పంపిణీ

Murali Krishna

Leave a Comment